సింహాచలం గిరిప్రదక్షిణలో భారీ రద్దీ

5525చూసినవారు
సింహాచలం గిరిప్రదక్షిణలో భారీ రద్దీ
సింహాచలం గిరిప్రదక్షిణ రెండోరోజు ఘనంగా కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం గిరిప్రదర్శన ప్రారంభమవ్వగా, సోమవారం ఉదయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఉభయగోదావరి, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు. దీంతో గిరిప్రదక్షిణ మార్గాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గిరిప్రదక్షిణ మార్గంలో కనుచూపు మేరలో ఇసుకేస్తే రాలనంతంగా భక్తులు కనిపించారు.

సంబంధిత పోస్ట్