పంటచేనులో దిగిన హెలికాప్టర్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ ఘటన ఇవాళ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో గల ఓ గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. ఆర్మీ హెలికాప్టర్ ఏఎల్హెచ్ ధృవ్ (ALH Dhruv)లో సాంకేతిక లోపం తలెత్తింది. గాల్లో ఎగురుతున్నప్పుడు పెద్దపెద్ద శబ్దాలు రావడంతో పైలట్ అప్రమత్తమై దాన్ని పంటచేనులో దించాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా లోపాన్ని సరిచేసిన తర్వాత హెలికాప్టర్ నాసిక్ మిలిటరీ స్టేషన్కు బయలుదేరి వెళ్లింది.