లోక్సభ ఎన్నికల వేళ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ లైంగిక వేధింపుల వ్యవహారం కర్ణాటకలో తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రజ్వల్, అతని తండ్రి చేసిన లైంగిక ఆగడాలకు బలైన వారిలో పని మనుషులు, కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, మహిళా అధికారులు కూడా ఉండడం గమనార్హం. దీంతో బాధితులు వారు చేసిన అకృత్యాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఓ వీడియోలో ప్రజ్వల్ తన తల్లిని కట్టేసి అత్యాచారం చేశాడని బాధితురాలి కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు.