ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి ఐదేళ్లు వైసీపీతో కలిసి పేద పిల్లల ఫీజులను భారీగా దారి మళ్లించారు. ఓట్ల లెక్కింపు రోజున వైకాపా ఓడిపోతుందని తెలుసుకుని వెంటనే కీలకమైన దస్త్రాలను మాయం చేశారు. కొన్నింటిని మెషీన్లో వేసి, ముక్కలుగా కట్ చేశారు. ఆ వెంటనే ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదించని ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు మెడికల్ లీవ్ మంజూరు చేశారు.