లెబనాన్కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ఇజ్రాయెల్పై క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ తన దళాల టాప్ కమాండర్ హజ్ అబూ తలేబ్ను చంపిన తర్వాత ప్రతీకార దాడిని ప్రారంభించింది. ఉత్తరాది ఇజ్రాయెల్పై భారీ దాడులు చేసింది. ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు. కాగా, ఇజ్రాయెల్తో పోరాడుతున్న హమాస్ ఉగ్రవాదులకు హిజ్బుల్లా మద్దతు ప్రకటించింది. ఈ బృందానికి ఇరాన్ మద్దతు ఇస్తోంది.