శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

64చూసినవారు
శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. వైకూంఠ క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలాగే, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. గురువారం వెంకన్నను 75,068 మంది దర్శించుకోగా, 33,372 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.48 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్