SRM జాయింట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష (SRMJEEE)ను SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహిస్తుంది. ఇందులో 7,000 అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ సీట్లలో ప్రవేశాల కోసం SRMJEE-2025 కంప్యూటర్ ఆధారిత పరీక్షను మూడు దశల్లో నిర్వహిస్తోంది. ఏటా లక్ష మంది ఈ పరీక్షకు హాజరవుతారు. కేంద్ర, రాష్ట్ర బోర్డు పరీక్షల్లో అగ్రశ్రేణి ర్యాంక్ పొందిన 1000 మంది IIT, JEE ర్యాంక్ హోల్డర్లకు నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు.