భారీ ఛేజింగ్‌.. 90 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి

591చూసినవారు
భారీ ఛేజింగ్‌.. 90 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి
90 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలోనే అత్య‌ధిక ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించి రైల్వేస్‌ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో భాగంగా త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రైల్వేస్‌ జట్టు.. ఈ అరుదైన ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు సౌరాష్ట్ర( 372) పేరిట ఉండేది. రైల్వేస్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ ప్రిథమ్‌ సింగ్‌(169*), మహ్మద్‌ సైఫ్‌(106) అద్బుత సెంచరీలతో చెలరేగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్