90 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి రైల్వేస్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా త్రిపురతో జరిగిన మ్యాచ్లో 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రైల్వేస్ జట్టు.. ఈ అరుదైన ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు సౌరాష్ట్ర( 372) పేరిట ఉండేది. రైల్వేస్ బ్యాటర్లలో ఓపెనర్ ప్రిథమ్ సింగ్(169*), మహ్మద్ సైఫ్(106) అద్బుత సెంచరీలతో చెలరేగారు.