ఆర్‌సీబీ భారీ స్కోర్

608చూసినవారు
ఆర్‌సీబీ భారీ స్కోర్
సొంత మైదానంలో ఆర్‌సీబీ బ్యాటర్లు రెచ్చిపోయారు. ఇవాళ చెన్నైతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. కోహ్లీ 47, డుప్లిసెస్ 54, పాటిదర్ 41, గ్రీన్ 38*, దినేశ్ కార్తీక్ 14, మాక్స్‌వెల్ 16 పరుగులతో రాణించారు. చెన్నై బౌలర్లలో శార్దూల్ 2, సాంట్నర్, దేశ్‌పాండే చెరో వికెట్ తీసుకున్నారు. చెన్నై లక్ష్యం 219.

సంబంధిత పోస్ట్