తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ప్రియుడిని 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు ఓ భర్త. యూపీలోని లఖింపూర్లో మహేంద్ర కుమార్ అనే వ్యక్తి కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఈ క్రమంలోనే తన భార్యతో ప్రియుడికి కాల్ చేయించి ఓ ప్రదేశానికి రప్పించాడు. అక్కడ ప్రియుడు మనోజ్, అతడి స్నేహితుడు రోహిత్ను తన వద్ద తుపాకీకి ఉండే కత్తితో దాదాపు 20 సార్లు పొడిచి హత్య చేశాడు.