IPL-2025: KKRతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ RCB తరపున రీ ఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. తుది జట్టులో భువీ చోటు దక్కకపోవడం ఫ్యాన్స్ తెగ బాధపడ్డారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే భువీ గాయంతో బాధపడుతున్నట్లు RCB తెలిపింది. కాగా, మ్యాచ్ మధ్యలో ప్లేయర్స్ గ్యాలరీలో ఉన్న భూవి దీనంగా కూర్చొని ఉన్న ఫోటోలు, వీడియోల కింద 'వి మిస్ యూ భువీ' అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.