HYD: జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో వాహనాలను చోరీ చేస్తున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో జగద్గిరిగుట్టలో వారెం ఆనంద్ రెడ్డిని(28) పోలీసులు పట్టుకున్నారు. అతడిని విచారించగా పాత నేరస్థుడని, వివిధ పోలీస్ ష్టేషన్లలో ద్విచక్రవాహనాలు దొంగతనం చేసినట్టు నిర్థారణ అయింది. నిందితుడి నుంచి 22 బైక్స్, ఒక ఆటో స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. వైన్స్ షాప్ ల వద్ద పార్క్ చేసిన బైక్ లే అతని టార్గెట్ అని పోలీసులు వెల్లడించారు.