వివాదంలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి (వీడియో)

527చూసినవారు
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత వివాదంలో చిక్కుకున్నారు. నిన్న శ్రీరామనవమి సందర్భంగా జరిగిన శోభాయాత్రలో ఆమె ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. యాత్ర ఓ మసీదు వద్దకు చేరుకోగానే మసీదుకు విల్లు ఎక్కు పెట్టి బాణం వదిలినట్టు ఆమె ప్రవర్తించింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని, ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్