మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి

65చూసినవారు
మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం చేరుకున్నారు. అఖిలపక్షం సమావేశం అనంతరం చుక్కా రామయ్య ఆరోగ్యం క్షీణించిందనే సమాచారం మేరకు పరామర్శించేందుకు విద్యానగర్ లోని అయన ఇంటికి సీఎం వెళ్లారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య కుటుంబసభ్యులతో ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట పలువురు నాయకులు, అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్