డ్రైనేజీ లైన్ మరమ్మత్తు పనులను పరిశీలించిన కార్పొరేటర్

80చూసినవారు
జహనుమా డివిజన్ పరిధిలో డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ ముక్తాదర్ బాబా గురువారం పర్యటించారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న డ్రైనేజీ లైన్ మరమ్మత్తు పనులను పరిశీలించారు. డ్రైనేజీ ఓవర్ ఫ్లో సమస్యలు ఉన్నాయని స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. త్వరగా పనులను పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. స్థానికంగా ఉండే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్