ఖైరతాబాద్ లోని రైల్వే గేట్ సమీపంలో ఉన్న ఓ కర్రీ పాయింట్ లో సోమవారం సిలిండర్ పేలింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అగ్నీ మాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం సమయంలో ఎలంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.