ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను దూషించడంతో పాటు పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన యువకుడికి నాంపల్లి కోర్టు 14 రోజుల జైలు శిక్షను విధించింది. ఆర్ఎన్ కాలనీకి చెందిన మహేష్ నాయక్ స్థానికంగా ఉన్న మహిళను దూషించాడు. 100కి డైల్ చేయడంతో ఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా వారిపట్ల దురుసుగా ప్రవర్తించాడు. కోర్టులో ప్రవేశపెట్టడంతో శనివారం జైలు శిక్ష విధించింది.