కేజ్రీవాల్ అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు

71చూసినవారు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అక్రమంగా అరెస్ట్ చేశారని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 7న నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లో ఆయన మాట్లాడారు. ఆప్ ను అంతం చేయడమే లక్ష్యంగా తమ పార్టీ అగ్ర నాయకులను బీజేపీ అరెస్ట్ చేయిస్తోందని మండిపడ్డారు. కేజ్రీవాల్ ను జైల్లో ఉంచి ఆయన ఆరోగ్యంతో బీజేపీ చెలగాటమాడుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్