ఇంటర్మీడియెట్ వార్షిక ఫలితాలను హైదరాబాద్లోని ఇంటర్ బోర్డులో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేశారు. ఈ ఫలితాల్లో అమ్మాయిలే హవా కొనసాగించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలోనూ వారే పైచేయి సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్స రంలో 60. 01 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.