ఇక నుంచి హోటళ్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి

65చూసినవారు
ఇక నుంచి హోటళ్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి
హైదరాబాద్ లోని 50 మంది సామర్ధ్యం దాటిన హోటళ్లలో వంటగదులు, భోజనశాలలో సీసీ కెమెరాలు ఇక నుంచి తప్పనిసరి. వినియోగదారులకు శుచి, శుభ్రమైన ఆహారం అందించేందుకు వీలుగా ఈ నిబంధనను తప్పకుండా అమలు చేయాలని జీహెచ్ఎంసీ ఆదేశించింది. రోజుల తరబడి ఆహార పదార్థాలను ఫ్రిజ్ ల్లో పెట్టి అవే మళ్లీ మళ్లీ వేడి చేసి వినియోగదారులకు వడ్డిస్తున్నారు. కొన్ని హోటళ్లలో బొద్దింకలు, తల వెంట్రుకలు లాంటివి దొరుకుతున్నాయి. ప్రతి హోటల్లో సీసీ కెమెరాలు పెట్టి వాటిని జీహెచ్ఎంసీ కార్యాలయానికి అనుసంధానం చేయడం, లేదంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు వాటిని పరిశీలించి చర్యలు తీసుకోనున్నారు.

సంబంధిత పోస్ట్