బల్కంపేట్ ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న కేంద్రమంత్రి

73చూసినవారు
నగరంలోని బల్కంపేట్ బోనాల జాతర కార్యక్రమంలో మంగళవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో పాల్గొన్న కేంద్రమంత్రి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభించడం పట్ల సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్