ఇందిర పార్క్ వద్ద వడ్డెర సంఘం దీక్ష

52చూసినవారు
రాబోయే అసెంబ్లీ సమావేశాల కంటే ముందే వడ్డెర కులాలను ఎస్సీ జాబితాలో చేర్చి కేంద్రానికి లేఖ పంపాలని, వడ్డెర కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో హక్కుల సాధనకై ఒకరోజు దీక్ష చేపట్టారు. గత ప్రభుత్వం తమను మోసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేస్తోందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్