ఆనారోగ్యంగా ఉండి పార్టీ సమావేశాలకు హజరుకాకపోతే పార్టీ మారుతున్నారని మీడియాలో తప్పుడు ప్రచారం జరిగే ప్రమాదం ఉందని కూకట్ పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అందుకే తాను జ్వరంతో బాధపడుతున్న ఈ మీటింగ్ కు వచ్చినట్లు తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్ లో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో పాల్గొని అయన మాట్లాడారు. తాను పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు.