కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఆగ్రహం

51చూసినవారు
రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల పనితీరుపై కూకట్ పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అల్లాపూర్ సున్నం చెరువు ఎఫ్ టి ఎల్ లో బోర్లు వేసి నీటిని తోడుతున్నారని స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన ఆయన స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించారు. రూ. 3 లక్షలు తీసుకొని ఒక్కో ఇంటికి 4 బోర్లు వేసుకునేందుకు అధికారులు ఎలా అనుమతి ఇచ్చారన్నారు. ఈ విషయంపై కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్