బెంగాల్‌పై మోదీ ప్రభుత్వానికి పగ: జైరాం రమేష్

69చూసినవారు
బెంగాల్‌పై మోదీ ప్రభుత్వానికి పగ: జైరాం రమేష్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2021లో బీజేపీని తిరస్కరించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రజలపై మోదీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుందని అన్నారు. ‘కేంద్రం నుంచి రావాల్సిన ఎన్నో నిధులు ఆగిపోయాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన, జాతీయ ఆరోగ్య మిషన్, జల్ జీవన్ మిషన్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులను ఇవ్వడం ఆపేసింది’ అని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్