అలే నరేంద్ర 10వ వర్ధంతిని పురస్కరించుకొని అంబర్ పేట్ డివిజన్ పతే నగర్ చౌరస్తాలో మంగళవారం నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు. నరేంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం చారి, చెరుకు రాజేష్ కుమార్, కృష్ణ ముదిరాజ్, యశ్వంత్, భాస్కర్ గౌడ్, దయాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు