మహిళ అదృశ్యం

74చూసినవారు
మహిళ అదృశ్యం
ఓ మహిళ అదృశ్యమైన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గుర్రం ప్రతాప్ రెడ్డి, భార్య శారదతో కలిసి నాగోలు సాయినగర్ లో ఉంటున్నాడు. వీరికి పెళ్లై మూడు సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు సంతానం కలగలేదు. ఈ నెల 10న ఇరువురి మధ్య చిన్న గొడవ జరగడంతో శారద ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, బంధువులతో ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో భర్త ప్రతాప్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్