శామీర్‌పేట్: జీనోమ్ వ్యాలీ వద్ద యాక్సిడెంట్.. మహిళ మృతి

78చూసినవారు
శామీర్‌పేట్: జీనోమ్ వ్యాలీ వద్ద యాక్సిడెంట్.. మహిళ మృతి
గేదెను బైక్ ఢీకొనడంతో మహిళ మృతి చెందిన ఘటన జీనోమ్ వ్యాలీ పీఎస్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు బైక్‌పై నలుగురు వ్యక్తులు హైదరాబాద్ వస్తుండగా మార్గ మధ్యలో గేదెను ఢీకొన్నారు. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న సంధ్య (26) అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన ముగ్గురికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్