దోపిడీ ముఠా అరెస్ట్

57చూసినవారు
దోపిడీ ముఠా అరెస్ట్
సికింద్రాబాద్ బుధవారం రాత్రి జరిగిన దారి దోపిడిని చిలకలగూడ పోలీసులు చేధించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ మీడియాతో మాట్లాడుతూ. దోపిడికి పాల్పడిన వారిలో ఉన్న ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్ కు ఐదుగురు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. వారి నుంచి మూడు సెల్ ఫోన్లు, రూ. వెయ్యి, రెండు బైక్లు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్