ఇద్దరి గొంతు కోసి పరారైన దుండగులు

60చూసినవారు
ఇద్దరి గొంతు కోసి పరారైన దుండగులు
గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరి గొంతు కోసిన ఘటన మేడ్చల్ మున్సిపాలిటి పరిధిలో జరిగింది. కిష్టాపూర్ గ్రామంలో బీహార్‌కు చెందిన పవన్ కుమార్‌, సంతోష్ జీవనం సాగిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి పరారయ్యారు. గమనించిన స్థానికులు వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అందులో సంతోష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్