కవాడిగూడ డివిజన్ లోని కొండారెడ్డి నగర్లో బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జైసింహా ఆదివారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సికింద్రబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఉద్యమ నాయకుడిగా ఉన్న పద్మారావు గౌడ్ అందరికీ సుపరిచితమే అని తప్పకుండా భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రచారంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.