భువనగిరి ఎంపీ టికెట్ ను చామల కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. ఈ నేపథ్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. భువనగిరి ప్రజలు ఇది అర్ధం చేసుకోవాలని సూచించారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.