ఎమ్మెల్యేతో కలిసి వాటర్ లైన్ పనులు ప్రారంభించిన కేంద్రమంత్రి

60చూసినవారు
గాంధీ నగర్ డివిజన్ పరిధి జవహర్ నగర్ గవర్నమెంట్ స్కూల్ వద్ద వాటర్, డ్రైనేజీ లైన్ పనులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, స్థానిక ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి శనివారం ప్రారంభించారు. పనులను త్వరగా ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. నాణ్యతతో రాజీ పడకుండా పనులను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్