మౌలాలి ప్రాంతంలోని ఆర్టీసీ కాలనీలో రోడ్డు పూర్తి అధ్వాన్నంగా మారింది. దీంతో అటువైపు ప్రయాణించే వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గురువారం ఈ మార్గంలో రోడ్డుపై వెళ్తున్న ఆటో బోల్తా పడింది. డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి. రోడ్డు బాగాలేదని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఇకనైనా మరమ్మత్తులు చేపట్టాలని లేదా నూతనంగా రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.