కుత్బుల్లాపూర్ నియోజక వర్గం షాపూర్ నగర్ లోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో గురువారం మాజీ ఎమ్మెల్యే తో కాంగ్రెస్ నేతల భేటీ అయ్యారు. కూన నివాసానికి వెళ్లిన మైనంపల్లి హన్మంత రావు, పట్నం మహేందర్ రెడ్డి, కొలన్ హన్మంతరెడ్డి, భూపతి రెడ్డి కాంగ్రెస్లోకి రావాలని కూన శ్రీశైలం గౌడ్ ను ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలోకి నేతలు ఆహ్వానించారు. కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నది.