శంకర్ యాదవ్ భౌతికకాయానికి మేయర్ నివాళి

61చూసినవారు
శంకర్ యాదవ్ భౌతికకాయానికి మేయర్ నివాళి
మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు బోయినపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తలసాని మృతిపై సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దిగ్బాంతి వ్యక్తం చేశారు. మారెడుపల్లి లోని అయన నివాసంలో శంకర్ యాదవ్ భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. భగవంతుడు అయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.