సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ అప్ లైన్ లో సోమవారం గుర్తుతెలియని రైల్ ఢీ కొని వ్యక్తి మృతి చెందాడు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతుడు బొల్లారం బజార్ కు చెందిన కూలి ఏ ప్రభాకర్ (41)గా గుర్తించినట్లు తెలిపారు. మృతుడు తాగుడుకు బానిసై రైల్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలిందని వెల్లడించారు.