సికింద్రాబాద్ - Secunderabad

గెలుపు దిశగా అడుగులు వేస్తున్న పద్మారావు

గెలుపు దిశగా అడుగులు వేస్తున్న పద్మారావు

పద్మారావు పేరు తెలియని వారుండరు.ఈయన నివాసం టకారబస్తీ, సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో ఉంది.ప్రస్తుతం సికింద్రాబాద్ అసెంబ్లీ భారాస సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా భారాస తరపున బరిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో ఎమ్మెల్యే గోపీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమావేశాలు,ప్రచారంలో పద్మారావు పాల్గొంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ మద్దతుగా రెండుసార్లు రోడ్ షో నిర్వహించి,ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గం బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలోనూ కేటీఆర్, పద్మారావు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి సైతం భారాసలో ఉండటం, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విష్ణువర్ధన్రెడ్డికి అనుబంధం ఉండటంతో ఎక్కువ ఓట్లు వస్తాయని భావిస్తున్నారు.

వీడియోలు


హైదరాబాద్
మోదీ పథకాలపై ఓటర్లకు అవగాహన కల్పించాలి: కొండా
May 11, 2024, 00:05 IST/చేవెళ్ల
చేవెళ్ల

మోదీ పథకాలపై ఓటర్లకు అవగాహన కల్పించాలి: కొండా

May 11, 2024, 00:05 IST
ప్రధాని మోదీ పథకాలపై ఓటర్లకు అవగాహన కల్పించి కమలం పువ్వుకు ఓటు వేయించే బాధ్యత బూత్ స్థాయి కమిటీల సభ్యుల పైనే ఉందని చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం శంషాబాద్, సిద్ధాంతి బస్తీలకు చెందిన వంద మంది భారాస నాయకులు, కార్యకర్తలు అజీజ్నగర్లోని విశ్వేశ్వర్ రెడ్డి కార్యాలయంలో భాజపా తీర్ధం పుచ్చుకున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో సమష్టిగా కృషి చేస్తే విజయం మనదే అన్నారు. నందకిషోర్, కుమార్యాదవ్, మేకల ఆనంద్, మహేందర్, వంశీ, బన్నీ, వీరేందర్ పాల్గొన్నారు.