ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

78చూసినవారు
ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో గిరిజన సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ, పీజీ కళాశాలలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో చేరడానికి ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ఇన్ ఛార్జ్ ప్రిన్సిపాల్ దివ్య రాణి తెలిపారు. ఇంటర్ ఎంపీసీ, బైపిసిలో 40 శాతం మార్కులు సాధించిన విద్యార్థినిలు ఈనెల 30వ తేదీలోపు షాద్ నగర్ శివారులోని నూర్ ఇంజనీరింగ్ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్