సిద్ధాపూర్ మాజీ సర్పంచ్ ఎర్రోళ్ల నరసమ్మ మృతి

76చూసినవారు
సిద్ధాపూర్ మాజీ సర్పంచ్ ఎర్రోళ్ల నరసమ్మ మృతి
షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఎర్రోళ్ల నరసమ్మ(80) ఆదివారం మృతి చెందారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2014- 19 మధ్య కాలంలో గ్రామ సర్పంచిగా సేవలందించారు. ఆమె హయాంలో సినీ హీరో మహేష్ బాబు గ్రామాన్ని దత్తత తీసుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఆమె మృతి పట్ల కొత్తూరు మాజీ జెడ్పిటిసి ఎమ్మె శ్రీలత సత్యనారాయణ సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్