అమెరికాలో మరో భారతీయ విద్యార్థి జీవితం విషాదంగా ముగిసింది. కనిపించకుండా పోయిన హైదరాబాద్ విద్యార్థి అబ్దుల్ మహ్మద్ అరాఫత్ ను రక్షించేందుకు భారత విదేశాంగ శాఖ,
అమెరికా పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అబ్దుల్ అరాఫత్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారని
భారత్ ఎంబసీ ట్వీట్ చేసింది. తమ కుమారుడిని డ్రగ్స్ మాఫియానే హత్య చేసిందని నాచారం కు చెందిన మృతుడు అబ్దుల్ అరాఫత్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.