గ్యారెంటీలు, ఉచితాల పేరుతో ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులను
కాంగ్రెస్ ప్రభుత్వం వృథా చేస్తోందని
బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ బుధవారం హైదరాబాద్లో విమర్శించారు. హామీలను అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి వాయిదాలతో కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి, విద్యుత్ కుంభకోణంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.