అభివృద్ది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

69చూసినవారు
అభివృద్ది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని యాకుత్ పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్ అన్నారు. ఈ మేరకు సోమవారం తలాబ్ చంచలం డివిజన్ లో పర్యటించిన అయన అభివృద్ది పనులను పరిశీలించారు. సకాలంలో పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పనుల్లో తప్పకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్