'ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి బాధితున్ని నేనే'

57చూసినవారు
'ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి బాధితున్ని నేనే'
తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి బాధితుడిని తానేనని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. తన కుటుంబసభ్యులందరి ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర చర్చ జరగాలని, మళ్లీ ఇలాంటి వ్యవహారం జరగకుండా చూడాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ 12 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్