రోహిత్ శర్మ ఇటీవల కపిల్ శర్మ షోకు శ్రేయస్ అయ్యర్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రూం షేర్ చేసుకునే అవకాశం వస్తే ఎవరితో కలిసి ఉంటారనే ప్రశ్నకు హిట్ మ్యాన్ సరదాగా స్పందించారు. 'ధవన్, పంత్లతో కలిసి ఉండలేను. వారు ప్రాక్టీస్ అవగానే దుస్తులను మంచంపై పడేస్తారు. మధ్యాహ్నం వరకు నిద్రపోతారు. రూం డోర్పై డిస్టర్బ్ చేయవద్దు అనే నోటీస్ ఉంటుంది. దీంతో క్లీనింగ్ సిబ్బందీ రారు. అందుకే వారితో ఉండాలనుకోను’ అని చెప్పారు.