'ట్రైనీ వైద్యురాలి మృతదేహాన్ని చూసి నేను పారిపోయా' అని పాలిగ్రాఫ్ పరీక్షలో చెప్పిన సంజయ్ రాయ్

62చూసినవారు
'ట్రైనీ వైద్యురాలి మృతదేహాన్ని చూసి నేను పారిపోయా' అని పాలిగ్రాఫ్ పరీక్షలో చెప్పిన సంజయ్ రాయ్
కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసులో తన ప్రమేయం లేదని ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ 'పాలిగ్రాఫ్' పరీక్షలో చెప్పినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. మృతదేహాన్ని చూసిన తర్వాత అతడు పారిపోయినట్లు చెప్పాడని వివరించాయి. ఆగస్టు 9న హత్యాచారం జరగగా, ఈ కేసులో అరెస్ట్ అయ్యాక కోల్‌కతా పోలీసుల ముందు అతడు నేరం ఒప్పుకున్నాడు. కానీ పాలిగ్రాఫ్ పరీక్షలో పలు నమ్మశక్యం కాని, పలు భిన్నమైన సమాధానాలు చెప్పినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్