ఈడీ నోటిసులపై ఇవాళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. విచారణకు హాజరు కావట్లేదని చెప్పారు. మరోసారి ఆయన విచారణకు హాజరుకావడంలేదని స్పందించడంపై ఈడీ అధికారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇటీవలే తన పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి
బీజేపీ ప్రయత్నించిందని, తనను జైల్లో వేస్తామని వారితో చెప్పిందని కేజ్రీవాల్ చేసిన ఆరోపణలతో ఇవాళ ఏం జరుగుతుందోనని ఆప్ నేతల్లో సందేహం నెలకొంది.