బీసీలకు 42% రిజర్వేషన్‌ కల్పించకపోతే భూకంపం సృష్టిస్తా: తీన్మార్ మల్లన్న

577చూసినవారు
బీసీలకు 42% రిజర్వేషన్‌ కల్పించకపోతే భూకంపం సృష్టిస్తా: తీన్మార్ మల్లన్న
బీసీల రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని హెచ్చరించారు. రిజర్వేషన్‌ను అమలు చేయకపోతే ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరని, రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాటను అమలుచేసి తీరాల్సిందేనని పేర్కొన్నారు. తెలంగాణలో బీసీ సర్కారు రాబోతోందన్నారు. బిచ్చగాళ్లలా కుల సంఘాలకు రూ.50 కోట్లను ఏ లెక్కన కేటాయిస్తారని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్