బీజేపీ 300 సీట్లు దాటితే అది ఈవీఎంల వల్లే: దిగ్విజ‌య్ సింగ్‌

73చూసినవారు
బీజేపీ 300 సీట్లు దాటితే అది ఈవీఎంల వల్లే: దిగ్విజ‌య్ సింగ్‌
లోక్‌స‌భ ఎన్నికల ఫలితాల వేళ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విప‌క్ష ఇండియా కూట‌మి 295 స్ధానాల్లో గెలుపొంది త‌దుప‌రి ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. పాలక పక్షానికి 300కుపైగా సీట్లు వ‌స్తే అవి ప్ర‌జ‌ల ఓట్ల‌తో కాద‌ని, ఈవీఎంల ఊతంతో అని బీజేపీ పేరు ప్ర‌స్తావించ‌కుండా ఆరోపించారు. నిజంగా ప్ర‌జ‌లు ఓటు వేస్తే వారికి మెజారిటీ స్ధానాలు ల‌భించ‌వ‌ని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్