సికింద్రాబాద్లో దానం నాగేందర్ గెలిస్తే కేంద్రమంత్రి పదవి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీతాఫల్మండీ రోడ్ షోలో మాట్లాడుతూ.. జంట నగరాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవలేదు. కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే.. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. సికింద్రాబాద్లో దానం నాగేందర్ గెలిస్తే కేంద్రమంత్రి పదవి వస్తుంది. దానం గెలిస్తే బస్తీవాసుల సమస్యలు పరిష్కరిస్తాం. దానం నాగేందర్కు అండగా ఉండి గెలిపించాలి' అని కోరారు.